శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (M) డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో చేపల వేట లేకున్నా ఒక పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించి, వెంటనే మరో పడవలో సముద్రంలోకి వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెబుతుండడంతో... 8 మంది మత్స్యకారులను ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.