శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (M) డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో చేపల వేట లేకున్నా ఒక పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించి, వెంటనే మరో పడవలో సముద్రంలోకి వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెబుతుండడంతో... 8 మంది మత్స్యకారులను ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.