శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (M) డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో చేపల వేట లేకున్నా ఒక పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించి, వెంటనే మరో పడవలో సముద్రంలోకి వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెబుతుండడంతో... 8 మంది మత్స్యకారులను ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.