Skip to main content

Posts

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Recent posts

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* నక్సల్స్ వంకతో నా ఫోన్ ట్యాప్ చేశారు: TPCC చీఫ్ * సింగరేణిలో సోలార్ స్కాం జరిగింది: హరీష్ రావు * మా ఫోన్లు ట్యాప్ కాలేదా అని సిట్ను ప్రశ్నించా: KTR * MSMEలో క్రెడిబిలిటీ, బ్రాండింగ్కు ప్రాధాన్యత: CBN * అనగాని సంస్కారం మర్చిపోయారు: పేర్నినాని * శబరిమల బంగారం చోరీపై విచారణ జరిపిస్తాం: మోదీ * WHO నుంచి వైదొలిగిన అమెరికా * తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ * ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు * ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ * పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR * తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI * రెండో టీ20లో NZపై భారత్ విజయం

ఆప్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అధికారులు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఆప్షోర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఈ ఈ శేఖర్ తన సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది నీటి సంఘ అధ్యక్షులు నిరంజన్ పాల్గొన్నారు.

లొద్దబద్ర గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 300 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

బ్రాహ్మణతర్ల గ్రామంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో పశు వైద్య అధికారి కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 186 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి: మోదీ * తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనుమ వేడుకలు * AP: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ * కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం ఉత్సవాలు * TG: గ్రూప్-3కి ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేత * ఆన్లైన్లో వేధింపులు.. పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు * 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్ * ఉమ్మడి ఆదిలాబాద్లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం * మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం * మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల * ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్ * రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్ * 'సంక్రాంతి' తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ🌱