Skip to main content

Posts

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
Recent posts

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

పలాస మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశాం : ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లు, మహిళలకు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తున్నామన్నారు. పల్లె పండగ ద్వారా ప్రతీ గ్రామంలో రోడ్లు వేశామని వెల్లడించారు. పలాస నియోజకవర్గంలో దాదాపు రూ. 930 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కాశీబుగ్గ రైల్వే వంతెన త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆఫ్ షోర్ జలాశయం కూడా త్వరలోనే పూర్తి చేసి నియోజక వర్గ ప్రజలకు సాగు, త్రాగు నీటిని అందిస్తామన్నారు. అమృత భారత్ కింద దాదాపు రూ. 60 కోట్లతో పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మరో వైపు జాబ్ మేళాలతో వందల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పలాసలో ఒక జీడి బోర్డు కోసం స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం పలాసలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉందన్నారు.

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

మీ వద్దకే వచ్చి సమస్యలు వింటాం - పరిష్కరిస్తాం : జిల్లా కలెక్టర్

ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు లో భాగంగా శుక్రవారం పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పలువురు తమ భూ సమస్యలను వినతుల రూపంలో అందించారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అప్పలరాజు, డిడిఓ రమేష్ నాయుడు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎండిఓ వసంత్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ రావు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, నేటి సంఘ అధ్యక్షులు గోనప నిరంజన్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా బిల్లు ఓ చరిత్రాత్మకం : ఎమ్మెల్యే శిరీష

ఆంధ్రప్రదేశ్ మహిళా బిల్లు - మహిళా సాధికారతకు చారిత్రాత్మకత అడుగు అంటూ.. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటుతో మహిళలకు సామాజిక రాజకీయ గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం టిడిపి ప్రభుత్వ నిదర్శనమని కొనియాడారు.

మందసలో ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం మందస మండలం హరిపురంలో పలాస నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి GME కాలనీలో సోమవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.