Skip to main content

Posts

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Recent posts

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన ఇచ్చాపురం విద్యార్థి

జిల్లా స్థాయి యోగ పోటీల్లో సత్తా చాటిన సాయి జగదీశ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ యోగ పోటీల్లో సాయి జగదీశ్‌ పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో సాధించిన విజయాన్ని రాష్ట్ర స్థాయిలోనూ కొనసాగించి ప్రతిభ కనబరచాలని పలువురు క్రీడాకారులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాయి జగదీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

గరుడుభద్రలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ తిరుపతిరావు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో శుక్రవారం సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నిహార్ తో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

తమిళనాడు గంజాయి తరలిస్తూ.. కాశీబుగ్గ పోలీసులకు చిక్కిన నలుగురు యువకులు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు జంక్షన్ వద్ద పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 3.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిస్సా రాష్ట్రం గుణుపూర్ నుంచి తమిళనాడు రైలు మార్గంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పట్టుబడినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.

పలాసలో మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శిరీష వినతి.

పలాసలో 2019లో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణ పనులు నేటికీ అసంపూర్తిగా నిలిచిన పనులను, వెంటనే పూర్తి చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడును మంగళవారం ఎమ్మెల్యే శిరీష కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస ప్రాంతంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించడంతోపాటు యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.