శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఆప్షోర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఈ ఈ శేఖర్ తన సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది నీటి సంఘ అధ్యక్షులు నిరంజన్ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 300 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.