Skip to main content

Posts

ఆప్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అధికారులు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఆప్షోర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఈ ఈ శేఖర్ తన సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది నీటి సంఘ అధ్యక్షులు నిరంజన్ పాల్గొన్నారు.
Recent posts

లొద్దబద్ర గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 300 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

బ్రాహ్మణతర్ల గ్రామంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో పశు వైద్య అధికారి కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 186 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి: మోదీ * తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనుమ వేడుకలు * AP: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ * కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం ఉత్సవాలు * TG: గ్రూప్-3కి ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేత * ఆన్లైన్లో వేధింపులు.. పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు * 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్ * ఉమ్మడి ఆదిలాబాద్లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం * మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం * మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల * ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్ * రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్ * 'సంక్రాంతి' తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ🌱

అక్రమాలపై ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా...?

శ్రీకాకుళం... అక్రమాలపై ప్రశ్నిస్తే... మాపై దాడులు చేస్తారా..? కాశిబుగ్గ పట్టణంలో అక్రమాలను ప్రశ్నించినందుకు నా విద్యా సంస్థలు(సూర్య తేజ)పై దాడులు చేస్తూ... గత 15 సంవత్సరాలుగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దానేటి పద్మజ మంగళవారం మీడియాతో వాపోయారు... అంతేకాకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ... ఓ వార్త సంస్థ నిజాలు తెలుసుకోకుండా వార్తను ప్రచురించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నాపై మానసిక, భౌతిక దాడులకు పాల్పడిన వారితో పాటు... అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* సోమ్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ * TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్ను: రేవంత్ * టికెట్ల ధరల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి * TG మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ * AP: నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదు: CBN * జనగణన 2027కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు * WPL 2026: UPపై గుజరాత్ విజయం * AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN * శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్ * అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల * TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్ని: రేవంత్ * సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి * తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన * 'అల్మాంట్-కిడ్' సిరప్పై నిషేధం విధించిన ప్రభుత్వం * సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ