శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే మాల్ గోదాం "వన్డే వర్కర్స్ కాన్ఫరెన్స్" ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ రైల్వే మాల్ గోడౌన్ శ్రామిక్ సంగ్ నేషనల్ ఇన్చార్జ్ మనోరంజన్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... *ఈశ్రమ్* కార్డును ప్రతి కార్మికుడికి అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఇన్చార్జ్ గా విధులు నిర్వహిస్తున్న మామిడి కమలమ్మను అధ్యక్షురాలుగా ఆయన ప్రకటించారు. అనంతరం గిరిజన మహిళలు నిర్వహించిన దింసా నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలాది మంది కార్మికులు హాజరయ్యారు.