Skip to main content

Posts

Showing posts from May, 2026

మీ వద్దకే వచ్చి సమస్యలు వింటాం - పరిష్కరిస్తాం : జిల్లా కలెక్టర్

ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు లో భాగంగా శుక్రవారం పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పలువురు తమ భూ సమస్యలను వినతుల రూపంలో అందించారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అప్పలరాజు, డిడిఓ రమేష్ నాయుడు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎండిఓ వసంత్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ రావు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, నేటి సంఘ అధ్యక్షులు గోనప నిరంజన్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా బిల్లు ఓ చరిత్రాత్మకం : ఎమ్మెల్యే శిరీష

ఆంధ్రప్రదేశ్ మహిళా బిల్లు - మహిళా సాధికారతకు చారిత్రాత్మకత అడుగు అంటూ.. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటుతో మహిళలకు సామాజిక రాజకీయ గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం టిడిపి ప్రభుత్వ నిదర్శనమని కొనియాడారు.

మందసలో ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం మందస మండలం హరిపురంలో పలాస నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి GME కాలనీలో సోమవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి : ఎమ్మెల్యే శిరీష

పలాసలో ఈనెల 27, 28 తేదీల్లో  మహానాడు కార్యక్రమం వర్చువల్ విధానంలో జరగనుందని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న టిడిపి క్యాడర్ ను సమన్వయం చేస్తూ... ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.

పలాసలో గంజాయి డిటెక్షన్ కిట్ తో ముమ్మర తనిఖీలు

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి డిటెక్షన్ కిట్ తో ఆదివారం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా వ్యక్తులు గంజాయిని సేవించినట్లయితే.. ఈ ప్రత్యేకమైన కిట్ ద్వారా ఘటన స్థలంలోనే పరీక్షించి తక్షణమే వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ గంజాయి డిటెక్షన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిఐ రామకృష్ణ తెలిపారు.

పలాసలో తాళం వేసిన ఇంట్లో చోరీ.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీ నగర్ లో చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో డి ఈ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి సెలవు నిమిత్తం కుటుంబ కలిసి స్వగ్రామానికి వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 4,500 రూపాయలు నగదు ను దొంగలు దోషుకెళ్ళినట్లు కాశీబుగ్గ సిఐ రామకృష్ణ తెలిపారు.

పలాసలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ.

శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి శ్రీనివాసనగర్ 2వ వీధిలో తాళం వేసి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు హేమశంకర్ వేసవి సెలవులు కారణంగా శుక్రవారం నాడు ఇంటికి తాళం వేసి సొంత ఊరైన మందస వెళ్లడంతో శనివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండితోపాటు రూ. 70 వేలు నగదు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి ఆధారాలు సేకరిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పలాసలో అన్న ప్రేమాయణం..! తమ్ముడు గొంతు కోసిన ఇద్దరు వ్యక్తులు.

శ్రీకాకుళం జిల్లా పలాస కెటి రోడ్ లో ఉన్న ఓ మొబైల్ షాప్ లో పనిచేస్తున్న యువకుడు లోలుగు ఈశ్వరరావుపై ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై దాడి చేసి, చాకు గొంతు కోశారు. బాధితుడు ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా గురండి పంచాయితీ పరిధి అంకుడు గ్రామానికి చెందిన లోలుగు ఈశ్వరరావు యొక్క అన్న లోలుగు రమేష్ ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావు పలాసలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యుల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

పది టాపర్లకు నగదు పురస్కారాలను అందించిన ఎమ్మెల్యే శంకర్

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ కు చెందిన పూజారి కీర్తి పండా - 591(జడ్పీ హైస్కూల్ కాశీబుగ్గ), బి షర్మిల - 591 (ఎంజెపి పలాస) లను యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ బి సంస్థ సౌజన్యంతో నగదు పురస్కారాలు శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కీర్తి పండా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కిల్లి వెంకట్రావు సహకారంతో ఇంతటి విజయం సాధించగలిగామని తెలిపారు.

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

శ్రీకాకుళం జిల్లా పలాస(M) కోసంగిపురం జంక్షన్ వద్ద బుధవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

కన్నుల పండగ గా జరగనున్న శ్రీశ్రీశ్రీ మహేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద మాకన్నపల్లి గ్రామంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. ఉద్యమాల గడ్డగా పేరుపొందిన ఉద్దానంలో..  సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఈ గ్రామం నుంచి పదుల సంఖ్యలో ప్రజలు అండమాన్ నికోబార్ దీవులకు వలస వెళ్లి స్థిరపడ్డారు. తరాలు మారుతున్న ఉద్దానంపై ఉన్న మక్కువతో ఓ శివాలయం తో పాటు కళ్యాణ మండపం నిర్మించాలని అండమాన్ లో స్థిరపడిన గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. వారి ఆలోచన గ్రామంలో ఉన్న వారితో పంచుకున్నారు. ఎట్టకేలకు 21-05-2021 తేదీన శివాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసిన సుమారు 0.80 ఎకరాల స్థలంలో చుట్టూ కొబ్బరి, జీడి, మామిడి తోటల మధ్యన సుమారు రూ. 2.50 కోట్ల నిధులతో శివాలయాన్ని నిర్మించారు. గ్రామస్తులతోపాటు పలాస లో ఉన్న వ్యాపారులు, దేశ విదేశాలలో స్థిరపడిన ఉద్దాన వాసుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందడంతో ఐదు సంవత్సరాల కాలంలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మహా బలిపురం నుంచి ప్రత్యేక దేవత మూర్తుల విగ్రహాలతో పాటు జైపూర్ నుంచి ప్రత్యేకం...

పదిలో మెరిసిన విద్యార్థులకు విజయనగరంలో ఘన సన్మానం

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో టాపర్లగా నిలిచిన ఇద్దరు విద్యార్థులు పూజారి కీర్తి పండా, బైనపల్లి షర్మిలను ఆదివారం విజయనగరంలో ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు, గాదె శ్రీనివాసులు నాయుడు సన్మానించారు. కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాలలో చదివిన కీర్తి పండా, పలాస ఎంజెపి పాఠశాలలో చదివిన షర్మిలకు 591 మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రధానోపాధ్యాయులు చిన్నం నాయుడు, విద్యాధర్, డీఈవో రవిబాబు, ఉపాధ్యాయులు కిల్లి వెంకట్రావు, యతిరాజు, వేణుగోపాలరావు, తారక రామారావు, రవికాంత్, సుధాకర్, అప్పలరాజు లకు సన్మానించారు.

మూలిపాడులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం మూలిపాడు గ్రామంలో రూ. 27 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండగ ద్వారా రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం ఎంపీ లాడ్స్ రూ. 4 లక్షలతో నిర్మించిన పెద్ద చెరువు మెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మెట్టపేటలో రూ. 39.60 లక్షలతో మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం పంచాయతీ పరిధి మెట్టపేట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా మంజూరైన రూ. 39.60 లక్షల నిధులతో మంచినీటి పథకాన్ని ఆదివారం ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

కాశీబుగ్గ లో జరిగిన భారీ చోరీని ఛేదించిన పోలీసులు

ఏప్రిల్ 7వ తేదీనాడు కాశీబుగ్గ నిత్యానందనగర్ లోగల వెంకటేశ్వర జ్యుయలరి షాప్ లో మిట్టమద్యాహ్నం చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన నిత్యానందనగర్ లో గల శ్రీ వెంకటేశ్వర జ్యులరీ షాప్ లో ఏప్రిల్ 7వ తేదీ నాడు మిట్టమద్యాహ్నం12 గంటల ప్రాంతంలో 7గురు దుండగులు జిఎస్టీ అధికారులమంటూ షాప్ లో చొరబడి ఒంటరిగా ఉన్న యజమాని అయిన కిల్లంశెట్టి రామకృష్ణారావు ను పిస్టల్స్ తో బెదిరించి చేతులకు బేడీలు వేసి సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారమందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసునమోదుచేసుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ఖాకీలు టీమ్స్ గా ఏర్పడి రంగంలోకి దిగారు. 5గురు దుండగులను పట్టుకున్న పోలీసులు వారివద్దనుండి 243 గ్రాముల బంగారు ఆభరణాలను,3.41 లక్షలరూపాయల నగదును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కే మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లాఎస్పీ మాట్లాడుతూ పూర్తిగా సాంకేతిక ఆధారాలతోనే కేసును ఛేదించగలిగామని అన్నారు.దుండగులు ముఖానికి మాస్కులు చేతులకు గ్...

తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే.. పది ఫలితాల్లో మెరిసిన ఎస్ జె పురం వాసి.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సుంకరి జగన్నాధపురం గ్రామానికి చెందిన గంగిట్ల యతీష్ గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో  573 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు రామారావు, అరుణ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుమారుడికి స్థానికంగా ఉన్న పాత టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన యతీష్ మంచి మార్కులు తెచ్చుకొని మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు బాలుడిని అభినందించారు.

పలాసలో కేంద్ర మంత్రితో కలిసి పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడుతూ.. ప్రతి నెల పెన్షన్ అందుతున్న తీరని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిచ్చ పెన్షన్ను కూటమి ప్రభుత్వం పెంచి అందిస్తున్న తీరును వివరించారు. IVRS విధానంలో సెల్ఫోన్ ద్వారా ప్రభుత్వ సర్వేకు స్పందించాలని కోరారు. అనంతరం నీలావతి ROB ని సుమారు రూ. 60 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. కొబ్బరిచెట్లూరు, సుమ్మాదేవి, గ్రామాల కు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో అప్పల్రాజు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, డీఎస్పీ భవాని, సిఐ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్, లోడగల కామేశ్వరరావు, బడ్డా నాగరాజు, చిన్ని, సంతోష్ నాయుడు, సారా జోగారావు, కుత్తుం ప్రకాష్ రావు కూటమినాయకులు పాల్గొన్నారు.