Skip to main content

కాశీబుగ్గ లో జరిగిన భారీ చోరీని ఛేదించిన పోలీసులు

ఏప్రిల్ 7వ తేదీనాడు కాశీబుగ్గ నిత్యానందనగర్ లోగల వెంకటేశ్వర జ్యుయలరి షాప్ లో మిట్టమద్యాహ్నం చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన నిత్యానందనగర్ లో గల శ్రీ వెంకటేశ్వర జ్యులరీ షాప్ లో ఏప్రిల్ 7వ తేదీ నాడు మిట్టమద్యాహ్నం12 గంటల ప్రాంతంలో 7గురు దుండగులు జిఎస్టీ అధికారులమంటూ షాప్ లో చొరబడి ఒంటరిగా ఉన్న యజమాని అయిన కిల్లంశెట్టి రామకృష్ణారావు ను పిస్టల్స్ తో బెదిరించి చేతులకు బేడీలు వేసి సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

సమాచారమందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసునమోదుచేసుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ఖాకీలు టీమ్స్ గా ఏర్పడి రంగంలోకి దిగారు.

5గురు దుండగులను పట్టుకున్న పోలీసులు వారివద్దనుండి 243 గ్రాముల బంగారు ఆభరణాలను,3.41 లక్షలరూపాయల నగదును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కే మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.

జిల్లాఎస్పీ మాట్లాడుతూ పూర్తిగా సాంకేతిక ఆధారాలతోనే కేసును ఛేదించగలిగామని అన్నారు.దుండగులు ముఖానికి మాస్కులు చేతులకు గ్లౌజులు ధరించి షాప్ లో చొరబడి సిసి కెమెరాలపై నల్లటి స్ప్రే కొట్టి కెమెరాలకు చిక్కకుండా చేశారన్నారు.

చోరీకి పాల్పడిన దుండగులు టోల్ ప్లాజా మార్గం గుండా వెళ్లకుండా పలాస మండలం కేదారిపురం గ్రామం వరకు మోటార్ సైకిళ్లపై వెళ్లి అక్కడే ఓ లే ఔట్ లో ముందుగానే తెచ్చి పెట్టుకుని ఉన్న కారులో ఒడిశా వైపు పారిపొయినట్లు తెలిపారు.
పోలీసులకు చిక్కిన 5 గురు దుండగుల్లో 4 గురు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా మరో దుండగుడు కాశీబుగ్గ కు చెందినవాడిగా గుర్తించామని,సదరు ముద్దాయి స్థానికుడు కావడంతో అతడి సహకారంతోనే దుండగులు చోరీకి స్కెచ్ గీసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.2023 లొనే రెక్కీ నిర్వహించారని,తాజాగా మరోసారి రెకీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారని ముద్దాయిలు తెలిపినట్లు ఎస్పీ చెపుతున్నారు.

చోరీకి ఉపయోగించిన టు వీలర్,ఫోర్ వీలర్ వాహనాలు, పిస్టల్స్,మొబైల్ ఫోన్లు ను స్వాధీనపరచుకున్న పోలీసులు పలు సెక్షన్ల పై కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.మహేశ్వర్ రెడ్డి తెలిపారు

High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.