పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...