శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో మంగళవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ముఖ్య నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికలకు అంత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.