నశా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు మాజీ సైనికులు కళాశాల విద్యార్థులతో కలిసి కాశిబుగ్గ శ్రీనివాసా లాడ్జ్ జంక్షన్ నుంచి పలాస ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ... యువత దేశాభివృద్ధికి వెన్నుముక లాంటి వారిని, అటువంటి యువత డ్రగ్స్ జోలికి పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం జీవితంలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ సిఐలు రామకృష్ణ, తిరుపతిరావు, ఎస్సైలు సునీల్, నరసింహమూర్తి సిబ్బంది, సప్ప నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.