ఇటీవల కురిసిన వర్షాలకు పలాస మండలం రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ప్రహరీ గోడ నేల కూలింది. దీంతో పశువులు ఆరోగ్య కేంద్ర ఆవరణలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయని, మరోవైపు విష సర్పాలు ఆసుపత్రిలోకి వస్తున్నాయని ఇక్కడ సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడను నిర్మించాలని సిబ్బంది కోరారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళబద్ర ఎల్ సి గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పలాస జి ఆర్ పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..