ఇటీవల కురిసిన వర్షాలకు పలాస మండలం రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ప్రహరీ గోడ నేల కూలింది. దీంతో పశువులు ఆరోగ్య కేంద్ర ఆవరణలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయని, మరోవైపు విష సర్పాలు ఆసుపత్రిలోకి వస్తున్నాయని ఇక్కడ సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడను నిర్మించాలని సిబ్బంది కోరారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.