శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.