శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప రహదారిపై శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా.. సుమారు ఐదు కిలోల గంజాయిని గుర్తించినట్లు శుక్రవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు గోవాకు అక్రమంగా ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సునీల్ తో పాటు హెచ్ సీ టెంక భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళబద్ర ఎల్ సి గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పలాస జి ఆర్ పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..