Skip to main content

ఒడిస్సా నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ... కాశీబుగ్గ పోలీసులకు చిక్కిన యువకుడు.

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప రహదారిపై శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా.. సుమారు ఐదు కిలోల గంజాయిని గుర్తించినట్లు శుక్రవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు గోవాకు అక్రమంగా ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సునీల్ తో పాటు హెచ్ సీ టెంక భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

High Viewed News

పలాసలో ఘోరం... ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళబద్ర ఎల్ సి గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పలాస జి ఆర్ పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..

పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

డ్రగ్స్ వద్దు బ్రో.. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ పిలుపు

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో  భాగంగా బుధవారం పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తిగా మారి దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తారని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే శిరీష

స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. పలాస ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం స్వచ్ఛ రథాలను ఆమె ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎండిఓ వసంత కుమార్,  ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, చిన్ని, శ్రీనివాసరావు, కృష్ణారావు, నవీన్  తదితరులు పాల్గొన్నారు.