శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప రహదారిపై శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా.. సుమారు ఐదు కిలోల గంజాయిని గుర్తించినట్లు శుక్రవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు గోవాకు అక్రమంగా ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సునీల్ తో పాటు హెచ్ సీ టెంక భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.