నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తిగా మారి దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తారని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.