Skip to main content

డ్రగ్స్ వద్దు బ్రో.. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ పిలుపు

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో  భాగంగా బుధవారం పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తిగా మారి దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తారని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

High Viewed News

పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే శిరీష

స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. పలాస ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం స్వచ్ఛ రథాలను ఆమె ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎండిఓ వసంత కుమార్,  ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, చిన్ని, శ్రీనివాసరావు, కృష్ణారావు, నవీన్  తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శిరీష

పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబు రావు, ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్, వంకల కుర్మారావు, కుత్తుం లక్ష్మణరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.