పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబు రావు, ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్, వంకల కుర్మారావు, కుత్తుం లక్ష్మణరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.