పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబు రావు, ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్, వంకల కుర్మారావు, కుత్తుం లక్ష్మణరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.