శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.