రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పై ఇటీవల మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఎవరైనా వేదిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.