శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో మంగళవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ముఖ్య నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికలకు అంత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.