శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు గ్రామంలో బుధవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మూఢనమ్మకాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో... గిరిజనులు నేటికీ మూఢనమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో సిల్లంగి వంటి అపోహలను నమ్మొద్దని ఆయన సూచించారు. గ్రామంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న స్వర్ణ గ్రామ సచివాలయ మహిళ సంరక్షక కార్యదర్శి అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.