శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేధారపుట్టుగ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందగా.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కంచిలి మండల పరిధిలో జరిగిన ఆదివారం సంత నుంచి పనస కాయలు లగేజీ ఆటోలో ఇచ్చాపురం వైపు తరలిస్తుండగా... లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కవిటి మండలం రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు పద్మ(50), గుజ్జుపుట్టుగ గ్రామానికి చెందిన మురపాల భారతి (55), ఇచ్చాపురం ఏఎస్ పేటకు చెందిన మద్దిలి తరినమ్మ (58) గా గుర్తించినట్లు కవిటి ఎస్సై రవికిరణ్ తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.