శ్రీకాకుళం జిల్లా పలాస (M) కైజోల గ్రామానికి ఆనుకుని ఉన్న రామగిరి పై నేటి నుంచి మూడు రోజులు పాటు జరుగుతున్న శ్రీ కోదండరామ ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురాగా... వందలాదిమంది మహిళలు పూర్ణకలశాలతో స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సుమారు 50 మంది యువకులు హనుమాన్ మాల ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు మూడు పూట్ల ఉచిత అన్న వితరణ కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి తో పాటు సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.