శ్రీ మద్భవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి పండితుల ముందు చెప్పినందుకు….శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపు తెంబూరు గ్రామానికి చెందిన పోలాకి శ్రీదేవి….శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం పొందారు. కాపు తెంబూరులో శనివారం నిర్వహించిన శివ కళ్యాణం సందర్భంగా ఆమెకు భర్త తిరుమలరావు తో కలిసి గీతా బృందం సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొల్లి దీనబంధు, పోలాకి రామకృష్ణారావు, కారగ్గి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.