శ్రీ మద్భవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి పండితుల ముందు చెప్పినందుకు….శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపు తెంబూరు గ్రామానికి చెందిన పోలాకి శ్రీదేవి….శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం పొందారు. కాపు తెంబూరులో శనివారం నిర్వహించిన శివ కళ్యాణం సందర్భంగా ఆమెకు భర్త తిరుమలరావు తో కలిసి గీతా బృందం సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొల్లి దీనబంధు, పోలాకి రామకృష్ణారావు, కారగ్గి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.