శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్రతీరంలో ఇద్దరు విద్యార్థులు రాకాసి అలలకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఒక మృతదేహం భావనపాడు తీరానికి చేరుకోగా... మరో మృతదేహం వజ్రపు కొత్తూరు మండలం అల్తాడా తీరానికి కొట్టుకొచ్చింది. మృతులు టెక్కలి ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా స్థానికులు గుర్తించారు. గోరువంకల అగస్త్య (19) బీటెక్ (it), విజయనగరం జిల్లా మెరకముడదాం కు చెందిన సారపెంట యశ్వంత్(18-CEC)గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.