శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగన్నాథ సాగర్ గట్టు తదితర ప్రాంతాల అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జగన్నాథ సాగర్ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.