శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగన్నాథ సాగర్ గట్టు తదితర ప్రాంతాల అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జగన్నాథ సాగర్ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.