నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం మందస మండలం హరిపురంలో పలాస నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.