ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ కు చెందిన పూజారి కీర్తి పండా - 591(జడ్పీ హైస్కూల్ కాశీబుగ్గ), బి షర్మిల - 591 (ఎంజెపి పలాస) లను యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ బి సంస్థ సౌజన్యంతో నగదు పురస్కారాలు శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కీర్తి పండా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కిల్లి వెంకట్రావు సహకారంతో ఇంతటి విజయం సాధించగలిగామని తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.