శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద మాకన్నపల్లి గ్రామంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. ఉద్యమాల గడ్డగా పేరుపొందిన ఉద్దానంలో.. సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఈ గ్రామం నుంచి పదుల సంఖ్యలో ప్రజలు అండమాన్ నికోబార్ దీవులకు వలస వెళ్లి స్థిరపడ్డారు. తరాలు మారుతున్న ఉద్దానంపై ఉన్న మక్కువతో ఓ శివాలయం తో పాటు కళ్యాణ మండపం నిర్మించాలని అండమాన్ లో స్థిరపడిన గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. వారి ఆలోచన గ్రామంలో ఉన్న వారితో పంచుకున్నారు. ఎట్టకేలకు 21-05-2021 తేదీన శివాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసిన సుమారు 0.80 ఎకరాల స్థలంలో చుట్టూ కొబ్బరి, జీడి, మామిడి తోటల మధ్యన సుమారు రూ. 2.50 కోట్ల నిధులతో శివాలయాన్ని నిర్మించారు. గ్రామస్తులతోపాటు పలాస లో ఉన్న వ్యాపారులు, దేశ విదేశాలలో స్థిరపడిన ఉద్దాన వాసుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందడంతో ఐదు సంవత్సరాల కాలంలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మహా బలిపురం నుంచి ప్రత్యేక దేవత మూర్తుల విగ్రహాలతో పాటు జైపూర్ నుంచి ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకురావడం విశేషం. మూడు రోజులపాటు మూడు పూట్ల అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రత్యేక షిప్ ద్వారా ఉద్దానం చేరుకుంటున్న వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...