శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి శ్రీనివాసనగర్ 2వ వీధిలో తాళం వేసి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు హేమశంకర్ వేసవి సెలవులు కారణంగా శుక్రవారం నాడు ఇంటికి తాళం వేసి సొంత ఊరైన మందస వెళ్లడంతో శనివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండితోపాటు రూ. 70 వేలు నగదు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి ఆధారాలు సేకరిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...