శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడుతూ.. ప్రతి నెల పెన్షన్ అందుతున్న తీరని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిచ్చ పెన్షన్ను కూటమి ప్రభుత్వం పెంచి అందిస్తున్న తీరును వివరించారు. IVRS విధానంలో సెల్ఫోన్ ద్వారా ప్రభుత్వ సర్వేకు స్పందించాలని కోరారు. అనంతరం నీలావతి ROB ని సుమారు రూ. 60 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. కొబ్బరిచెట్లూరు, సుమ్మాదేవి, గ్రామాల కు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో అప్పల్రాజు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, డీఎస్పీ భవాని, సిఐ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్, లోడగల కామేశ్వరరావు, బడ్డా నాగరాజు, చిన్ని, సంతోష్ నాయుడు, సారా జోగారావు, కుత్తుం ప్రకాష్ రావు కూటమినాయకులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...