శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడులో శుక్రవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ యొక్క లెగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. పశు వైద్యులు పద్మావతి, పాపారావు, మధుబాబు ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం లెగదూడల పెంపకంపై పలు సూచనలు, సలహాలు రైతులకు పశు వైద్యులు పాపారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మురిపింటి నారాయణ, రాపాక శాంతారావు, కోనారి గణపతి, అంబటి నారాయణ, కోనేరి వల్లభరావు, కొంచాడ మోహనరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.