ఒడిస్సా నుంచి చిత్తూరు జిల్లాకు గంజాయి తరలిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. సిఐ రామకృష్ణ తెలిపిన వివరాలు మేరకు శుక్రవారం ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో పలాస రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగ్ లు పరిశీలించగా వారి వద్ద 6.200 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. వీరుపై గతంలో పలు కేసులు నమోదయి ఉన్నాయన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని శనివారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.