ఒడిస్సా నుంచి చిత్తూరు జిల్లాకు గంజాయి తరలిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. సిఐ రామకృష్ణ తెలిపిన వివరాలు మేరకు శుక్రవారం ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో పలాస రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగ్ లు పరిశీలించగా వారి వద్ద 6.200 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. వీరుపై గతంలో పలు కేసులు నమోదయి ఉన్నాయన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని శనివారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.