శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం(M) డొంకూరు గ్రామానికి చెందిన బడే చంటి (22) అబుదాబి లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అబుదాబిలో వెల్డింగ్ పనులు చేస్తూ... చంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంపెనీ యాజమాని మృతుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ... తమ కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్ అశోక్ బాబు కు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కోరారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.