శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం(M) డొంకూరు గ్రామానికి చెందిన బడే చంటి (22) అబుదాబి లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అబుదాబిలో వెల్డింగ్ పనులు చేస్తూ... చంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంపెనీ యాజమాని మృతుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ... తమ కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్ అశోక్ బాబు కు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కోరారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.