శ్రీకాకుళం జిల్లా మందస(M) కొండలోగాం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చివరి భూములకు సాగు నీరు కూటమి ప్రభుత్వంలో అందించామని, మార్కెట్లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జామ చేస్తుందని ఆమె తెలిపారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...