Skip to main content

దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ పోరులో.. భారత్ గెలుపు

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్(70), బాష్(67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది.

హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రికెల్టన్(0), డికాక్(0) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మార్క్రమ్(7) ఐదో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్దీప్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్ మలిచే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన యాన్సన్ దూకుడుగా ఆడుతూ.. మాథ్యూకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్దీప్ వీరిద్దరిని పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్రయెన్ 17 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో బాష్ (67) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్రణా 3, అర్ష్దీప్ 2, ప్రసిద్ధ ఒక వికెట్ తీశారు. అంతకుముందు విరాట్ కోహ్లి(135) శతకంతో.. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 349/8 స్కోర్ చేసింది.

High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

పలాస మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.