Skip to main content

దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ పోరులో.. భారత్ గెలుపు

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్(70), బాష్(67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది.

హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రికెల్టన్(0), డికాక్(0) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మార్క్రమ్(7) ఐదో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్దీప్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్ మలిచే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన యాన్సన్ దూకుడుగా ఆడుతూ.. మాథ్యూకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్దీప్ వీరిద్దరిని పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్రయెన్ 17 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో బాష్ (67) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్రణా 3, అర్ష్దీప్ 2, ప్రసిద్ధ ఒక వికెట్ తీశారు. అంతకుముందు విరాట్ కోహ్లి(135) శతకంతో.. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 349/8 స్కోర్ చేసింది.

High Viewed News

జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్.  జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.

పలాసలో కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి వేసిన వడ్డీ వ్యాపారి

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో పలువురు వ్యాపారులుకు కుచ్చుటోపి వేసి కోట్లాది రూపాయలుతో ఉడాయించిన ఓ ప్రైవేట్ సంస్థ యాజమాని. ఇటీవల కాలంలో పలాసకు చెందిన సంస్థ యాజమాని గుండె పోటుతో మృతి చెందగా... ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉడాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో అధిక వడ్డీలకు ఆశబడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని పూర్తి వివరాలతో మళ్లీ మీ ముందుకు LMR NEWS NETWORK లో....

జాతీయ రహదారిపై అర్థరాత్రి దాటిన వేళ (BT)దోపిడి..!

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ పరిధిలో అర్థరాత్రి దాటాక జరుగుతున్న అక్రమాలు నందిగాం, టెక్కలి, కోటబొమ్మాలి మండలాల పరిధిలో జాతీయ రహదారిపై నిల్వ ఉంచిన (BT) అక్రమంగా తరలిపోతున్న వైనం... జెసిబిలు సహాయంతో ట్రాక్టర్ల పై తరలిస్తున్న వైనం... ఈ అక్రమ తరలింపుకు గురైన(BT)పై వస్తున్న సొమ్ము ఎవరి జోబిలోకి వెళ్తుందో..!    ----- మరిన్ని పూర్తి వివరాలతో

పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుదాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీడియా సాక్షిగా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రకటించి, నేడు అసెంబ్లీలో ప్రకటించిన జిల్లాల్లో పలాస పేరు లేకపోవడం చాలా బాధాకరమని పలాసకు చెందిన దువ్వాడ శ్రీధర్ (బాబా) మీడియాతో తెలిపారు. భౌగోళికంగా పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.   ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి పలాసను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను విభజించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు శాంతియుతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.

ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలానికి పూర్తయిన అంత్యక్రియలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.