ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.