హాంకాంగ్లోని తై పొ (Tai Po) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలు హైరిస్ నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ భవనాల్లో ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి, సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...