Skip to main content

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.

శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.

అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీవోపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు. దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

High Viewed News

జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్.  జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.

పలాసలో కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి వేసిన వడ్డీ వ్యాపారి

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో పలువురు వ్యాపారులుకు కుచ్చుటోపి వేసి కోట్లాది రూపాయలుతో ఉడాయించిన ఓ ప్రైవేట్ సంస్థ యాజమాని. ఇటీవల కాలంలో పలాసకు చెందిన సంస్థ యాజమాని గుండె పోటుతో మృతి చెందగా... ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉడాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో అధిక వడ్డీలకు ఆశబడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని పూర్తి వివరాలతో మళ్లీ మీ ముందుకు LMR NEWS NETWORK లో....

జాతీయ రహదారిపై అర్థరాత్రి దాటిన వేళ (BT)దోపిడి..!

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ పరిధిలో అర్థరాత్రి దాటాక జరుగుతున్న అక్రమాలు నందిగాం, టెక్కలి, కోటబొమ్మాలి మండలాల పరిధిలో జాతీయ రహదారిపై నిల్వ ఉంచిన (BT) అక్రమంగా తరలిపోతున్న వైనం... జెసిబిలు సహాయంతో ట్రాక్టర్ల పై తరలిస్తున్న వైనం... ఈ అక్రమ తరలింపుకు గురైన(BT)పై వస్తున్న సొమ్ము ఎవరి జోబిలోకి వెళ్తుందో..!    ----- మరిన్ని పూర్తి వివరాలతో

పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుదాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీడియా సాక్షిగా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రకటించి, నేడు అసెంబ్లీలో ప్రకటించిన జిల్లాల్లో పలాస పేరు లేకపోవడం చాలా బాధాకరమని పలాసకు చెందిన దువ్వాడ శ్రీధర్ (బాబా) మీడియాతో తెలిపారు. భౌగోళికంగా పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.   ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి పలాసను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను విభజించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు శాంతియుతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.

ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలానికి పూర్తయిన అంత్యక్రియలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.