బెంగళూరులో ఓ భర్త ఎవరూ ఊహించని విధంగా తన భార్యను చంపాడు. పాదరసం ఇంజెక్ట్ చేసి.. 9 నెలలు నరకం చూపించాడు. దీని కారణంగా ఈ తొమ్మిది నెలల కాలంలో ఆమెలోని ఒక్కో అవయవం పాడవుతూ వచ్చింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోవడానికి ముందే తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి వివరించింది. అలాగే తన భర్తకు పాదరసం, సిరంజిలు, క్లోరోఫామ్ను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అందించారని పేర్కొంది. విద్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా భర్త బసవరాజు పై కేసు నమోదు చేశారు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.