బెంగళూరులో ఓ భర్త ఎవరూ ఊహించని విధంగా తన భార్యను చంపాడు. పాదరసం ఇంజెక్ట్ చేసి.. 9 నెలలు నరకం చూపించాడు. దీని కారణంగా ఈ తొమ్మిది నెలల కాలంలో ఆమెలోని ఒక్కో అవయవం పాడవుతూ వచ్చింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోవడానికి ముందే తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి వివరించింది. అలాగే తన భర్తకు పాదరసం, సిరంజిలు, క్లోరోఫామ్ను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అందించారని పేర్కొంది. విద్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా భర్త బసవరాజు పై కేసు నమోదు చేశారు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.