శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో పలువురు వ్యాపారులుకు కుచ్చుటోపి వేసి కోట్లాది రూపాయలుతో ఉడాయించిన ఓ ప్రైవేట్ సంస్థ యాజమాని. ఇటీవల కాలంలో పలాసకు చెందిన సంస్థ యాజమాని గుండె పోటుతో మృతి చెందగా... ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉడాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో అధిక వడ్డీలకు ఆశబడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని పూర్తి వివరాలతో మళ్లీ మీ ముందుకు LMR NEWS NETWORK లో....
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.