శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలో మృతి చెందగా... మరో యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కాశిబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.