పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ78 లక్షలు కాజేసిన కేసులో 13 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. విచిత్రంగా, విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.