పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ78 లక్షలు కాజేసిన కేసులో 13 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. విచిత్రంగా, విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.