పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ78 లక్షలు కాజేసిన కేసులో 13 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. విచిత్రంగా, విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.