శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండల పరిధిలో మంగళవారం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి అభి యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం శుభదాయకమని కొనియాడారు. అనంతరం పరిశ్రమంలో యంత్రాల పనితీరును ఆమె స్వయంగా పరివేక్షించారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధి మరింత వ్యాప్తి చెంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.