శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండల పరిధిలో మంగళవారం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి అభి యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం శుభదాయకమని కొనియాడారు. అనంతరం పరిశ్రమంలో యంత్రాల పనితీరును ఆమె స్వయంగా పరివేక్షించారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధి మరింత వ్యాప్తి చెంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.