శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండల పరిధిలో మంగళవారం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి అభి యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం శుభదాయకమని కొనియాడారు. అనంతరం పరిశ్రమంలో యంత్రాల పనితీరును ఆమె స్వయంగా పరివేక్షించారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధి మరింత వ్యాప్తి చెంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.