వైకుంఠ ఏకాదశి దర్శనాలకు నవంబర్ 27 నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2న లక్కీడిప్ ద్వారా మొదటి మూడు రోజులకు టికెట్లు కేటాయించబడతాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.