శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ... మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.