శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ... మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.