శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ... మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.