శ్రీకాకుళం జిల్లా నందిగాం (M) లట్టిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బొమ్మాళి సుదర్శన్ తన కుమార్తెతో కలిసి హరిదాసుపురం వెళ్లేందుకు లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా... పలాస నుంచి కోటబొమ్మాలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా... ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా... ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుదర్శన్ ను శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.