శ్రీకాకుళం జిల్లా నందిగాం (M) లట్టిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బొమ్మాళి సుదర్శన్ తన కుమార్తెతో కలిసి హరిదాసుపురం వెళ్లేందుకు లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా... పలాస నుంచి కోటబొమ్మాలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా... ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా... ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుదర్శన్ ను శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.