శ్రీకాకుళం జిల్లా నందిగాం (M) లట్టిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బొమ్మాళి సుదర్శన్ తన కుమార్తెతో కలిసి హరిదాసుపురం వెళ్లేందుకు లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా... పలాస నుంచి కోటబొమ్మాలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా... ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా... ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుదర్శన్ ను శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...