శ్రీకాకుళం జిల్లా మందస మండలం నర్శింగుపురం, జిల్లుండా గ్రామ సచివాలయాలను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించి, సిబ్బందిని సమయాపాలన పాటించాలని తెలిపారు. వివిధ సమస్యలపై సచివాలయం కు వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉంటూ... ప్రజల యొక్క వినతులను స్వీకరించి సకాలంలో వారి సమస్యలను పూర్తిచేయాలని ఆమె తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.