Skip to main content

వాడివేడిగా మాక్ అసెంబ్లీ.. వారిని మార్షల్స్ ఎత్తి బైటేశారు!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్‌ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు.

డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు.

విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకొని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది.

కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించిన చిన్నారులు. ఇది చూసి అయినా వాళ్ళు కళ్ళు తెరిచి సభా మర్యాదలు పాటిస్తారేమో చూడాలి.

High Viewed News

సోంపేటలో పొద్దు పొడవకముందే పోలీసుల తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో  తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.

బాలిగాంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు..

శ్రీకాకుళం.... ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు.  పలాస మండలం కంబ్రిగాం పరిధిలో సృష్టించిన హడావుడి అంతా ఉత్తిదే...  ఎన్నో ఏళ్లగా కొర్నుగా ఉన్న భూమిలో రెవిన్యూ అధికారుల అనుమతితో మట్టి వేస్తున్న రైతులు. సర్వే నెంబర్ 18 లో ఒకచోట ఆరు సెంట్లు మరోచోట సెంటున్నార అధికంగా మట్టి వేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. ఆ మట్టి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి.           ------ మోహన్ అప్డేట్స్ 🎤                ☎️9705703970

పలాసలో కలకలం రేపిన అస్థిపంజరం...

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.