శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు బిడ్జ్ సమీపంలో ఈనెల 8వ తేదీన ఒడిస్సా కు చెందిన లొట్ల లక్ష్మయ్య వద్ద రూ. 10 లక్షలు అసలు నోట్లు తీసుకొని రూ. 50 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నట్లు చెప్పి పుస్తకాలతో ఉన్న సంచి ఇచ్చి కారులో పరారైన విషయం తెలిసిందే... ఈ కేసులో పలాస కు చెందిన సునీల్ అనే యువకుడును ఆదివారం సాయంత్రం అమరావతి హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.