శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు బిడ్జ్ సమీపంలో ఈనెల 8వ తేదీన ఒడిస్సా కు చెందిన లొట్ల లక్ష్మయ్య వద్ద రూ. 10 లక్షలు అసలు నోట్లు తీసుకొని రూ. 50 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నట్లు చెప్పి పుస్తకాలతో ఉన్న సంచి ఇచ్చి కారులో పరారైన విషయం తెలిసిందే... ఈ కేసులో పలాస కు చెందిన సునీల్ అనే యువకుడును ఆదివారం సాయంత్రం అమరావతి హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...