శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు బిడ్జ్ సమీపంలో ఈనెల 8వ తేదీన ఒడిస్సా కు చెందిన లొట్ల లక్ష్మయ్య వద్ద రూ. 10 లక్షలు అసలు నోట్లు తీసుకొని రూ. 50 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నట్లు చెప్పి పుస్తకాలతో ఉన్న సంచి ఇచ్చి కారులో పరారైన విషయం తెలిసిందే... ఈ కేసులో పలాస కు చెందిన సునీల్ అనే యువకుడును ఆదివారం సాయంత్రం అమరావతి హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.