పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఉన్న నెహ్రూ పార్క్ (ముత్యాలమ్మ కోనేరు) అభివృద్ధి పనులను గురువారం ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట పట్టణాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నెహ్రూ పార్కును కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే కోనేరుకు నాలుగు వైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టిడిపి నేతలు గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, సప్ప నవీన్, యవ్వారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?