పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఉన్న నెహ్రూ పార్క్ (ముత్యాలమ్మ కోనేరు) అభివృద్ధి పనులను గురువారం ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట పట్టణాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నెహ్రూ పార్కును కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే కోనేరుకు నాలుగు వైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టిడిపి నేతలు గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, సప్ప నవీన్, యవ్వారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.