Skip to main content

పొలంలోనే కాలి బూడిదైన వరి కుప్ప.

శ్రీకాకుళం జిల్లా పలాస(M) తర్లాకోట పంచాయితీ పరిధి గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరికుప్ప అగ్నికి ఆహుతి అయ్యింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతలు అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పు చేసి పొలంలో వ్యవసాయ పెట్టుబడి పెట్టానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని సుంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

High Viewed News

సోంపేట పట్టణంలో 30 తులాల బంగారం చోరీ.

శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

పలాసలో నందమూరి అభిమానుల సందడి.

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో ఎంతో ఉత్కంఠ ంగా చూస్తున్న నందమూరి అభిమానులకు నిరాశ మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ఇప్పటికే రెండుసార్లు పలు కారణాల చేత వాయిదా పడిన విషయం తెలిసిందే... నేడు ప్రీమియర్ షో వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో... పలాస శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ వద్దకు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. రాత్రి 10 అవుతున్న సినిమా హాల్ గేట్లు తెరవకపోవడంతో అ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది.

పలాస ఆర్ఆర్ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహేంద్ర తనయ ఆప్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు రూ. 7.61 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ ఆర్ కాలనీలలో మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు.

పలాసలో త్వరలో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయ తరగతులు: ఎమ్మెల్యే శిరీష

పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.