శ్రీకాకుళం జిల్లా పలాస(M) తర్లాకోట పంచాయితీ పరిధి గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరికుప్ప అగ్నికి ఆహుతి అయ్యింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతలు అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పు చేసి పొలంలో వ్యవసాయ పెట్టుబడి పెట్టానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని సుంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.