Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు. 

* TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ

* ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

* AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN

* కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్

* క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

* రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన

* ఢిల్లీలో ముగిసిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

* పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రాలేదన్న కేటీఆర్

* కాంగ్రెస్, సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్.. ఓట్ చోరీ ర్యాలీలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం

* భారీగా పెరిగిన బంగారం ధరలు

* ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 90.75కు పతనం

* ప్రధాని మోదీతో మెస్సీ మీటింగ్ క్యాన్సిల్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.

* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.

* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

* మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు

* నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం

* ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు

* ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN

* లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

* మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN

* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్

* TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల

* ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన


 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం

* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం

* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం

* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు

* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ విజయం)

High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.