Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు. 

* TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ

* ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

* AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN

* కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్

* క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

* రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన

* ఢిల్లీలో ముగిసిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

* పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రాలేదన్న కేటీఆర్

* కాంగ్రెస్, సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్.. ఓట్ చోరీ ర్యాలీలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం

* భారీగా పెరిగిన బంగారం ధరలు

* ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 90.75కు పతనం

* ప్రధాని మోదీతో మెస్సీ మీటింగ్ క్యాన్సిల్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.

* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.

* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

* మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు

* నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం

* ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు

* ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN

* లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

* మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN

* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్

* TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల

* ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన


 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం

* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం

* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం

* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు

* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ విజయం)

High Viewed News

సోంపేటలో పొద్దు పొడవకముందే పోలీసుల తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో  తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

బాలిగాంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు..

శ్రీకాకుళం.... ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు.  పలాస మండలం కంబ్రిగాం పరిధిలో సృష్టించిన హడావుడి అంతా ఉత్తిదే...  ఎన్నో ఏళ్లగా కొర్నుగా ఉన్న భూమిలో రెవిన్యూ అధికారుల అనుమతితో మట్టి వేస్తున్న రైతులు. సర్వే నెంబర్ 18 లో ఒకచోట ఆరు సెంట్లు మరోచోట సెంటున్నార అధికంగా మట్టి వేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. ఆ మట్టి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి.           ------ మోహన్ అప్డేట్స్ 🎤                ☎️9705703970

పలాసలో కలకలం రేపిన అస్థిపంజరం...

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.