Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు. 

* TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ

* ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

* AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN

* కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్

* క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

* రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన

* ఢిల్లీలో ముగిసిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

* పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రాలేదన్న కేటీఆర్

* కాంగ్రెస్, సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్.. ఓట్ చోరీ ర్యాలీలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం

* భారీగా పెరిగిన బంగారం ధరలు

* ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 90.75కు పతనం

* ప్రధాని మోదీతో మెస్సీ మీటింగ్ క్యాన్సిల్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.

* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.

* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

* మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు

* నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం

* ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు

* ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN

* లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

* మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN

* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్

* TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల

* ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన


 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం

* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం

* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం

* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు

* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ విజయం)

High Viewed News

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.